ఇందుకోసం రూ.1,001/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.
తిరుచానూరులోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, బ్రేక్ దర్శనాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ వ్రతం టికెట్లను త్వరలో ఆన్లైన్, ఆఫ్లైన్లో కేటాయిస్తారు.
#Tiruchanoor #padmavathi_ammavari_temple #VaralakshmiVratham
No comments:
Post a Comment